NBK107 సెట్లో అడుగుపెట్టిన శృతి హాసన్..

NBK107 సెట్లో అడుగుపెట్టిన శృతి హాసన్..

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. బాలకృష్ణ 107వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ ఆడిపాడనుంది. తాజాగా ఈ మూవీ షుటింగ్ లో శృతి జాయిన్ అయ్యింది. 

ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపాడు. తనకి ఇష్టమైన హీరోయిన్‌ షూటింగ్ లో చేరిందంటూ ఆమెతో దిగిన ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. గతకొద్ది రోజులుగా బాలకృష్ణతో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించిన గోపీచంద్.. తదుపరి షెడ్యూల్ లో బాలయ్య, శృతిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాడు. కాగా,ఈ మూవీలోనూ బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు.