నీకై క్షణాల్లో పడిపోని మనసే అది

నీకై క్షణాల్లో పడిపోని మనసే అది

రణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో  మూడు పార్టులుగా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘శివ’ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  సెప్టెంబర్ 9న విడుదలవుతోంది. నిన్న సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘కుంకుమలా’ అంటూ సాగే ఈ పాటకు  మెలోడియస్ ట్యూన్ కంపోజ్ చేశాడు ప్రీతమ్. ‘పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది. నీకై క్షణాల్లో పడిపోని మనసే అది. ఆ బ్రహ్మే నిను చేయడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే. అందాల నీ కంటి కాటుకతో రాసి ఉంటాడే నా నుదుటిరాతలనే. కుంకుమలా నువ్వే చేరగా ప్రియా’ అని  చంద్రబోస్ రాసిన లిరిక్స్‌‌‌‌తో సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సినిమాకు హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచేలా ఉంది.  కాశీ లోకేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దీన్ని  షూట్ చేశారు. ఆలియా, రణబీర్ జంట ఆకట్టుకుంది. సౌత్ లాంగ్వేజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ రిలీజ్ కానున్న ఈ చిత్రానికి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.