ఆధ్యాత్మికం: అన్న ప్రాశన ఎందుకు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి?

ఆధ్యాత్మికం: అన్న ప్రాశన ఎందుకు చేయాలి? ఎప్పుడు  చేయాలి? ఎలా చేయాలి?

బిడ్డ పుట్టగానే ఆ ఇంట్లో సందడే వేరు. ఎప్పుడెప్పుడు నాలుగు మెతుకులు తింటాడా.. బుడి బుడి అడుగులు వేస్తాడా.. అత్తా.. తాత అంటుంటే  ఆ కుటుంబసభ్యుల ఆనందమే వేరు.. నాలుగు మెతుకులు తినేందుకు  అన్నప్రాసన​ అనే కార్యక్రమంతో పెడతారు. బియ్యంతో మెత్తగా పాయసాన్ని వండి.. వారి కులాచారం ప్రకారం.. సంప్రదాయం ప్రకారం...ఈ వేడుకను నిర్వహిస్తారు. ధర్మ శాస్త్రం ప్రకారం అసలు అన్నప్రాస ఎందుకు జరపాలి.. ఎలా జరపాలి.. ఎప్పుడు జరిపాలో తెలుసుకుందాం. 

అన్న ప్రాశనం అనేది బిడ్డకు మొదటిసారి బియ్యం లేదా ఘనాహారం ఇచ్చే శుభకార్యంగా భారతీయ సంస్కృతిలో చేసేది. దీన్ని సంస్కృతంలో "అన్నప్రాశన" అని అంటారు

 అన్న ప్రాశన ఎప్పుడు చేయాలి?

సాధారణంగా బిడ్డ 6 నెల.. ఆరో రోజున  ఈ కార్యక్రమం చేయడం ఆనవాయితీ. ఆ రోజు కుదరని వారు  6వ నుంచి  8వ నెల మధ్యలో మంచిరోజు చూసుకొని ఈ సంబరాన్ని చేసుకుంటారు.  కొంతమంది ఆచారాల ప్రకారం మగ బిడ్డకు పురుషుల‌కు 6వ నెలలో ,ఆడ బిడ్డకు  5వ నెల లేదా 7వ నెలలో కూడా చేసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని  ముహూర్తం చూసుకుని, పండితుల సలహాతో మంచి తిథి, నక్షత్రం చూసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు.

ఎందుకు చేయాలి?

బిడ్డ పుట్టిన దగ్గరి నుంచి మొదటి ఆరునెలలు  తల్లి పాలల్లో చాలా పోషకాలుంటాయి.  ఆ వయస్సులో తల్లిపాలు శిశువుకు సరిపోతాయి.   ఆ సమయంలో బయటి ఫుడ్​ పెడితే ఘన పదార్దాలను పెడితే జీర్ణించుకొనే శక్తి ఉండదు.  ఇక ఆరు నెలల తరువాత పొట్ట పెరడగంతో పాటు ఆకలి కూడా క్రమేణ పెరుగుతుంది.  తల్లి పాల విషయానికొస్తే  ఆరు నెలల తరువాత  పోషకాలు క్రమేణ తగ్గుతాయి.. (అందుకే గేదెలు కూడా ఈనినప్పుడు మొదటి మూడు రోజులు జున్ను పాలు వస్తాయి.. వీటిని పూర్తిగా దూడలకే పడతారు.. అయితే ఇప్పుడు జనాలు వాటికి కూడా కక్కుర్తి పడుతున్నారనుకోండి.) 

6 నెలల తర్వాత శిశువు శరీరానికి మరిన్ని పోషకాల అవసరం ఉంటుంది. అందుకే సాధారణంగా అప్పటి నుంచి బిడ్డలకు ఘనాహారం పెడతారు.  ఇది ఆరోగ్యపరంగా ముఖ్యమైనదే కాకుండా, సాంప్రదాయ పరంగా శుభ కార్యంగా భావిస్తారు.బిడ్డ  ఆరోగ్యంగా ఎదగాలని ఆశిస్తూ బంధువుల మధ్య ఈ శుభకార్యాన్ని నిర్వహిస్తారు.

 ఎలా చేయాలి?

పసి బిడ్డకు మొదటి సారిగా ఘన ఆహారం ఇచ్చేటప్పుడు.. శుభ ముహూర్తం నిర్ణయించుకుని, ఆలయంలో లేదా ఇంట్లో కార్యక్రమాన్ని  ఘనంగా నిర్వహిస్తారు. బిడ్డకు స్నానం చేయించి , కొత్త బట్టలు వేసి, మెడలో రక్ష గా(బంగారు/వెండి గొలుసు) వేస్తారు. దీనిని సాధారణంగా అమ్మమ్మ.. తాతయ్య, మేనమామలు ఇవ్వడం భారతీయ సంప్రదాయం.  ఆ తరువాత  పూజారి ఆశీర్వాదంతో, దేవుని పూజ చేసి, బిడ్డకు మొదటిసారి బియ్యం (అన్నం) తినిపిస్తారు.

పాయసం, సాధారణ అన్నం, బనానా పేస్ట్, లేదా గెహూని రవ్వ పాయసం వంటివి మొదట తినిపిస్తారు.మొదట తల్లి లేదా తండ్రి,  తరువాత మేనమామ.. బామ్మ.. తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య తరువాత ఇతర పెద్దవాళ్లు ఒక్క మెతుకు మాత్రమే  తినిపిస్తారు. అనంతరం బంధువులు బిడ్డకు ఆశీర్వాదాలు ఇస్తారు.