హిందువులు జరుపుకొనే ప్రతి పండుగకు ఏదో ఒక విశిష్టత ఉంది. పురాణాల్లో ప్రతి పండుగ ప్రాముఖ్యత.. ఎందుకు జరుపుకోవాలో విపులంగా రుషులు రాశారు. దేశ వ్యాప్తంగా.. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగకు దేశ విదేశాల్లో.. ఎక్కడ ఉన్నా.. సొంతూళ్లలోనే జరుపుకోవడాని జనాలు ఇష్ట పడతారు. పురాణాల ప్రకారం సంక్రాంతి పండుగ.. ప్రాధాన్యత .. విశిష్టత గురించి తెలుసుకుందాం. . .!
పురాణాలు.. పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి పండుగ సూర్యభగవానుడి సంచారం ఆధారంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని ధ్యానించడం.. పవిత్ర నదుల్లో స్నానం చేయడం..దాన ధర్మాలకు ఎంతో విశిష్టత ఉందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. ఈ ఏడాది జనవరి 15 న మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. అంతే కాదు మకర సంక్రాంతి నుంచే వివాహాలు.. శుభకార్యాలు ప్రారంభమవుతాయి. మకర సంక్రాంతి రోజున చేసే దానాలకు వందరెట్లు ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
సంక్రాంతి పండుగ... దేవతల రోజు
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకరసంక్రాంతి అని పిలుస్తారు. అందుకే ఈ రోజును దేవతల దినం అని కూడా అంటారు. ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం.. ఉత్తరాయణ సమయాన్ని దేవతలకు పగలని.. దక్షిణాయన సమయాన్ని దేవత
శాస్త్రాలలో ఉత్తరాయణ సమయాన్ని దేవతల రోజు అని, దక్షిణాయణ సమయాన్ని దేవతల రాత్రి అని అంటారు. మకర సంక్రాంతి ఒకరకంగా దేవతల రోజే అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున గంగానీటితో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం, జపం, తపస్సుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ తేదీని ఉత్తరాయణ కాలం అని పురాణాలు చెబుతున్నాయి.
భీష్మ పితామహుడు
పురాణాల ప్రకారం భీష్మ పితామహుడు మకర సంక్రాంతి రోజే తన శరీరాన్ని వదిలేందుకు సిద్దమయ్యాడు. భీష్ముడు బాణాలున్న మంచం మీద పడుకుని ఉత్తరాయణం రోజు కోసం ఎదురు చూస్తుంటాడు. కాగా భీష్ముడు తన జీవితాన్ని మకర సంక్రాంతి రోజు త్యాగం చేస్తాడు. అయితే ఉత్తరాయణంలో శరీరాన్ని త్యాగం చేయడం వల్ల వారి ఆత్మ కొన్ని క్షణాల పాటు దేవలోకానికి వెళ్తాయని లేదా పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందుతారని పురాణాలు వెళ్లడిస్తున్నాయి.
మకర సంక్రాంతి పండుగ అన్ని పండుగల్లో కెళ్లా అతిముఖ్యమైందని. ఎందుకంటే ఈ రోజు తండ్రి సూర్యుడు తన కుమారుడైన శనిదేవుడి రాశి అయిన మకర రాశిలోకి వెళ్లి నెల మొత్తం ఉంటాడు.
మకర సంక్రాంతిని ఏ రోజున జరుపుకుంటారు?
ఈ పండుగను దేశవ్యాప్తంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. మాఘీ అని, మాఘే సంక్రాంతి అంటూ వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను మకర సంక్రాంతి అని, గుజరాత్ లో ఉత్తరాయణం అని పిలుస్తుంటారు. దీనిని పంజాబ్ లో లోహ్రీగా, ఉత్తరాఖండ్ లో ఉత్తరాయణిగా, కేరళలో పొంగల్ గా జరుపుకుంటారు. ఈ పండుగను ప్రతి ఏడాది జనవరి 14న జరుపుకుంటారు. కానీ ఈ సారి (2025) మకర సంక్రాంతి పండుగను 15న జరుపుకుంటున్నారు.
