
సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)- 2024 అవార్డుల వేడుక శనివారం దుబాయ్లో గ్రాండ్గా జరిగింది. తెలుగు చిత్రాలకు సంబంధించి దసరా, హాయ్ నాన్న, బేబీ చిత్రాలు ఎక్కువ అవార్డులు సాధించాయి. ‘దసరా’ చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటుడిగా నాని , ఉత్తమ నటిగా కీర్తి సురేష్ అవార్డులు అందుకున్నారు. అలాగే బాలకృష్ణ, -అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇక ‘దసరా’ చిత్రానికి గాను నాని, కీర్తి సురేష్తో పాటు బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో శ్రీకాంత్ ఓదెల, బెస్ట్ సపోర్టింగ్ రోల్ కేటగిరీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన దీక్షిత్ శెట్టికి అవార్డులు దక్కాయి. అలాగే ‘బేబి’ సినిమా టీమ్ కూడా నాలుగు అవార్డ్స్ అందుకున్నారు.
బెస్ట్ యాక్టర్ క్రిటిక్గా ఆనంద్ దేవరకొండ, బెస్ట్ డెబ్యూ హీరోయిన్గా వైష్ణవి చైతన్య, బెస్ట్ డైరెక్టర్ క్రిటిక్గా సాయి రాజేష్, బెస్ట్ లిరిక్స్ విభాగంలో అనంత్ శ్రీరామ్ అవార్డ్స్ అందుకున్నారు. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రానికి గాను ఉత్తమ నటి (క్రిటిక్)గా మృణాల్ ఠాకూర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా శౌర్యువ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా హేషమ్ అబ్దుల్ వహాబ్, బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా విజయేందర్ రెడ్డి తీగల, నాని కూతురి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ ఖియారా ఖాన్కి ఉత్తమ సహాయ నటి కేటగిరిలో అవార్డులు అందుకున్నారు.
అలాగే ‘బలగం’ చిత్రానికి గాను ఉత్తమ గాయకుడిగా రామ్ మిరియాల అవార్డు అందుకున్నాడు. అలాగే సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అందుకోగా, బెస్ట్ డెబ్యూ యాక్టర్ కేటగిరిలో సంగీత్ శోభన్ (మ్యాడ్), ఎమర్జింగ్ యాక్టర్గా సుమంత్ ప్రభాస్ (మేమ్ ఫేమస్) అవార్డులు అందుకున్నారు. ఈ వేడుకలో ఎంతోమంది హీరో, హీరోయిన్స్ తమ స్పెషల్ పెర్ఫార్మెన్స్లతో కనువిందు చేశారు. సైమా చైర్ పర్సన్స్ విష్ణు వర్ధన్ ఇందూరి, బృందా ప్రసాద్ మాట్లాడుతూ ‘సౌత్ ఇండియన్ సినిమాలోని ది బెస్ట్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎంతోఆనందం ఉంది’ అని అన్నారు.