వంట గ్యాస్​కోసం ఈకేవైసీ చేసుకోవాలి : పాలకుర్తి రాజు

వంట గ్యాస్​కోసం ఈకేవైసీ చేసుకోవాలి : పాలకుర్తి రాజు

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సూపర్​బజార్ల ద్వారా వంట గ్యాస్ పొందుతున్న ఇండియన్ గ్యాస్​ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని సింగరేణి సూపర్​ బజార్ డివిజనల్​ మేనేజర్​ పాలకుర్తి రాజు అన్నారు. మందమర్రిలోని సింగరేణి సూపర్​బజార్​లో ఈకేవైసీ అవగాహన సదస్సు నిర్వహించారు.

 ఇండియన్​ ఆయిల్​ కంపెనీ ఆదేశాలతో ప్రతి వినియోగదారుడు గ్యాస్​కనెక్షన్​ నిరంతరం పొందేందుకు అనుసంధానం తప్పనిసరి అన్నారు. కాల పరిమితి అయిపోయిన గ్యాస్ పైప్ ను వెంటనే మార్చుకోవాలని, లేకపోతే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుందని హెచ్చరించారు. బ్రాంచి మేనేజర్ ​సుదర్శన్, ఎల్​పీజీ కోఆర్డినేటర్​ రాజు, ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ ఇన్​చార్జి మాధవరావు ప్రసాద్ పాల్గొన్నారు.