
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి సూపర్బజార్ల ద్వారా వంట గ్యాస్ పొందుతున్న ఇండియన్ గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని సింగరేణి సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్ పాలకుర్తి రాజు అన్నారు. మందమర్రిలోని సింగరేణి సూపర్బజార్లో ఈకేవైసీ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఇండియన్ ఆయిల్ కంపెనీ ఆదేశాలతో ప్రతి వినియోగదారుడు గ్యాస్కనెక్షన్ నిరంతరం పొందేందుకు అనుసంధానం తప్పనిసరి అన్నారు. కాల పరిమితి అయిపోయిన గ్యాస్ పైప్ ను వెంటనే మార్చుకోవాలని, లేకపోతే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుందని హెచ్చరించారు. బ్రాంచి మేనేజర్ సుదర్శన్, ఎల్పీజీ కోఆర్డినేటర్ రాజు, ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ ఇన్చార్జి మాధవరావు ప్రసాద్ పాల్గొన్నారు.