టీఎస్‌పీఎస్సీపేపర్ లీకేజీ కేసు.. 37 మంది నిందితులపై అభియోగపత్రం

 టీఎస్‌పీఎస్సీపేపర్ లీకేజీ కేసు..  37 మంది నిందితులపై అభియోగపత్రం

టీఎస్‌పీఎస్సీపేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు.  ఈ క్రమంలో వచ్చేవారం నిందితులపై అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. ఇందులో 37మంది నిందితులను చేర్చనున్నారు. న్యాయసలహా తీసుకొని వచ్చే వారంలో అభియోగపత్రం దాఖలు చేసే యోచనలో సిట్‌ అధికారులు ఉన్నట్లు సమాచారం..

కాగా ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటివరకు 50 మంది ఆరెస్ట్  చేయగా15 మంది బెయిల్ పై  బయట ఉన్నారు.   కీలక నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మిగతా నిందితులు జైల్లోనే ఉన్నారు.   ఇక డీఈ పూల రమేష్ అరెస్టుతో పేపర్ లీకేజీ కేసు  కొత్త మలుపు తిరుగుతోంది.

జనవరి, ఫిబ్రవరిలో జరిగిన ఏఈఈ, డీఏఓ పరీక్ష రాసిన కొందరు అభ్యర్థులతో హైటెక్ మాస్ కాపీయింగ్ చేయించిన రమేష్..  దాదాపు 80మందికి విక్రయించినట్లు సిట్‌ అధికారుల దర్యాప్తులో తేలింది. ఆ రెండు పరీక్షలను రాసిన మొత్తం 7 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ కేసు విచారణ కొనసాగుతుండటంతో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారలు చెబుతున్నారు.