నేపాల్ ప్రధాని భార్య సీతా దహల్ కన్నుమూత

నేపాల్ ప్రధాని భార్య సీతా దహల్ కన్నుమూత

నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ భార్య సీతా దహల్(69) బుధవారం (జులై 12న) కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆమెకు గుండెపోటు రావడంతో ఖాట్మండులోని నార్విక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ తరలించారు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందించినప్పటికీ.. ప్రోగ్రెసివ్ సుప్రాన్యూక్లియర్ పాల్సీ, పార్కిన్సోనిజం, డయాబెటిస్ మెల్లిటస్-ఎల్‌ఎల్, హైపర్‌టెన్షన్, (ఆన్/ఆఫ్) డొమిసిలియరీ వల్ల ఆక్సిజన్ తగ్గిపోవడంతో కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయారు.

రెండేళ్ల క్రితం పుష్ప్ కమల్ దహల్ ప్రచండ కూడా తన భార్యకు వైద్యం చేయించుకునేందుకు ముంబై వచ్చారు. ఆయన భార్య సీతా దహల్ చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. కొంతకాలంగా ఆమె పార్కిన్సన్స్ లాంటి లక్షణాలతో బాధపడుతోంది.