కేసీఆర్కు బిగ్ షాక్ ... కాంగ్రెస్లోకి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.?

కేసీఆర్కు బిగ్ షాక్ ... కాంగ్రెస్లోకి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.?

సచివాలయంలో  మంత్రి శ్రీధర్ బాబును కలిశారు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.  కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు,  ఉప్పల్ ఎమ్మెల్యే  బండారు లక్ష్మా రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మల్కాజ్ గిరి  ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఉన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలని  విజ్ఞప్తి చేశారు.  అభివృద్ధి పనులు ప్రతిపాదనలను  మంత్రి శ్రీధర్ బాబుకు అందించారు ఎమ్మెల్యేలు. జీహెచ్‌ఎంసీకి నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నుంచి జీహెచ్‌ఎంసీకి నిధులు ఇవ్వలేదన్నారు. 

కూకట్ పల్లి నియోజకర్గంలోని చెరువులు, కుంటల్లో పెరిగిపోయిన గుర్రపు డెక్క తొలగించాలని..  దోమలను  నివారించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. నియోజకర్గంలోని అన్ని డివిజన్ లలో ఎలక్ట్రికల్ పోల్స్,  వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.  కూకట్ పల్లి, మూసాపేట్ సర్కిళ్ళ పరిధిలో నెలకొన్న శానిటేషన్ సమస్యలు పరిష్కరించాలని, అలాగే కూకట్ పల్లి నియోజకవర్గం లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే ల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి  శ్రీధర్ బాబు రాజకీయాలకు అతీతంగా పనులు చేయడం జరుగుతుందన్నారు. తప్పకుండా మీ సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు. 

రేపో మాపో జంప్?

 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా రేపో మాపో  బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ఇప్పటికే పలువురు మంత్రులు చెప్పిన సంగతి తెలిసిందే..