
మహారాష్ట్రలో జికా వైరస్ విజృంభిస్తోంది. పుణేలో ఆరుగురికి ఈ వైరస్ సోకింది. ఇందులో ఇద్దరు మహిళ గర్బిణిలు కూడా ఉన్నారు. ఎరంద్వానే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల గర్భిణీ స్త్రీకి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఆమెకు రిపోర్టులలో పాజిటివ్గా వచ్చాయి. 12 వారాల గర్భిణి అయిన మరో మహిళకు కూడా ఇన్ఫెక్షన్ సోకింది. ప్రస్తుతం ఇద్దరు మహిళల పరిస్థితి బాగానే ఉందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ఈ వైరస్ గర్బిణిలకు సోకితే పుట్టే బిడ్డల్లో మెదడు అభివృద్ధి ఉండదు. జికా వైరస్ వ్యాధి సోకిన ఆడ ఏడెస్ దోమ కాటు ద్వారా ఇది వ్యాపిస్తుంది. జ్వరం, దద్దర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది డెంగ్యూ, చికున్గున్యా వంటి ఇన్ఫెక్షన్లను కూడా వ్యాపిస్తుంది. 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్ను గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలతోసహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది.
పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఫాగింగ్, ఫ్యూమిగేషన్ వంటి దోమల వృద్ధిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఒక అధికారి తెలిపారు. పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం నిఘా నిర్వహిస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా దోమల వృద్ధిని అరికట్టేందుకు ఫాగింగ్, ఫ్యూమిగేషన్ వంటి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.