
కర్ణాటకలో ఓ షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. చిత్రదుర్గ జిల్లాలోని ఆదిశక్తి నగర్లోని ఓ ఇంట్లో ఐదుగురి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, తీవ్ర అనారోగ్య సమస్యలతో వారు పూర్తిగా ఏకాంత జీవితాన్ని గడుపుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఈ కుటుంబం స్థానికులకు చివరి సారిగా జూన్-జూలై 2019లో కనిపించినట్టు చెబుతున్నారు. వారి ఇంటికి ఎప్పుడూ తాళం వేసి ఉండేదని అంటున్నారు.
అయితే, 2 నెలల క్రితం, మార్నింగ్ వాక్కు వెళ్లిన కొందరు వ్యక్తులు ఇంటి ప్రధాన చెక్క తలుపు పగలగొట్టి కనిపించినప్పటికీ స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుత దృశ్యాలు చూస్తుంటే వారు ఇలా ఇంట్లోకి చాలాసార్లు చొరబడి దోచుకున్నట్లు సూచిస్తున్నాయి. నాలుగు అస్థిపంజరాలు (మంచాలపై రెండు, నేలపై రెండు) ఒక గది లోపల నిద్రిస్తున్న స్థితిలో మరొకటి వేరే గదిలో ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు.
- జగన్ నాథ్ రెడ్డి (85), రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
- జగన్ నాథ్ రెడ్డి భార్య ప్రేమ, 80 సంవత్సరాలు
- జగన్నాథరెడ్డి కుమార్తె త్రివేది, 62 సంవత్సరాలు
- కృష్ణబాబు రెడ్డి కుమారుడు జగన్నాథరెడ్డి, 60 సంవత్సరాలు
- జగన్నాథరెడ్డి కుమారుడు నరేంద్ర రెడ్డి, 57 సంవత్సరాలు
ఈ కేసులో పోస్టుమార్టం, ఫోరెన్సిక్ విచారణ అనంతరం మృతుడి వివరాలు వెల్లడి కానున్నాయి.