త్వరలో ఎస్‌‌ఎల్‌‌బీసీ పనులు: ఆర్అండ్ఆర్‌‌ కమిషనర్‌‌ శివకుమార్‌‌నాయుడు వెల్లడి

త్వరలో ఎస్‌‌ఎల్‌‌బీసీ పనులు: ఆర్అండ్ఆర్‌‌ కమిషనర్‌‌ శివకుమార్‌‌నాయుడు వెల్లడి

అచ్చంపేట, వెలుగు : ప్రమాదం కారణంగా నిలిచిపోయిన ఎస్‌‌ఎల్‌‌బీసీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రాజెక్ట్‌‌ ఆర్‌‌అండ్‌‌ఆర్‌‌ ప్యాకేజీ స్పెషల్‌‌ కమిషనర్‌‌ శివకుమార్‌‌నాయుడు చెప్పారు. అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి అవుట్‌‌లెట్‌‌ వద్ద పనులను ప్రారంభించి ప్రాజెక్ట్‌‌ను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

మన్నెవారిపల్లి వద్ద సొరంగ నిర్మాణ ప్రాంతాన్ని శుక్రవారం ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సొరంగం పనులను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని, ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆయన వెంట అడిషనల్‌‌ కలెక్టర్‌‌ అమరేందర్‌‌, ఆర్డీవో మాధవి, తహసీల్దార్‌‌ సైదులు ఉన్నారు.