పాలమూరు రంగారెడ్డి .. పనులు త్వరగా పూర్తి చేయండి.. :స్మితా సబర్వాల్

పాలమూరు రంగారెడ్డి .. పనులు త్వరగా పూర్తి చేయండి.. :స్మితా సబర్వాల్

కొల్లాపూర్, వెలుగు : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు.  నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 1 పనులను సోమవారం ఆమె పరిశీలించారు. డ్రై రన్, వెట్ రన్ కోసం రెడీ అవుతున్న పంపులు, పంప్ హౌజ్, విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులు, విద్యుత్ కంట్రోల్ ప్యానల్ ను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు 31 నుంచి మూడు రోజుల పాటు డ్రై రన్ నిర్వహించి, సెప్టెంబర్ 15న వెట్ రన్ నిర్వహించేందుకు రెడీ కావాలని సూచించారు.  సెప్టెంబర్ 15న నార్లాపూర్, అక్టోబర్ లో ఏదుల, నవంబర్ లో వట్టెం రిజర్వాయర్ కు నీటిని పంప్ చేసేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆమె వెంట ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఉన్నారు .