కాంగ్రెస్ లోకి సొసైటీ డైరెక్టర్ రోశయ్య

కాంగ్రెస్ లోకి సొసైటీ డైరెక్టర్ రోశయ్య

కారేపల్లి, వెలుగు : విశాల సహకార పరపతి సంఘం డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు మర్సకట్ల రోశయ్య వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీతారాంపురం గ్రామానికి చెందిన రోశయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో కారేపల్లి సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బానోత్ రామ్మూర్తి, బొల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు.