శంషాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సౌందర్య ఆత్మహత్య

శంషాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సౌందర్య ఆత్మహత్య

శంషాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సౌందర్య ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర కు చెందిన గాజుల సౌందర్య మూడేళ్లుగా  కొండాపూర్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది.  2022 డిసెంబర్ 2న మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన మెకానికల్ ఇంజినీర్ అభినవ్ తో పెళ్లి అయింది.   జూన్ 8న సాయంత్రం  భర్త అభినవ్ తోపాటు తన మామకు ఫోన్ చేసిన సౌందర్య .. తాను దూరంగా వెళ్లిపోతున్నానని చెప్పి ఫోన్ కట్ చేసింది. కాసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేసి.. శంషాబాద్ లో  నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుంచి దూకుతున్నట్లు భర్త కి ఫోన్ చేసి చేసింది సౌందర్య.

ఆమె భర్త అభినవ్  వెంటనే డయల్ 100 కి కాల్ చేయడంతో శంషాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే  రక్తపు మడుగులో గాయాలతో ఉన్న సౌందర్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు.  మూడు రోజుల నుంచి చికిత్స తీసుకుంటూ జూన్ 10న మృతి చెందింది సౌందర్య. పోస్టుమార్టం అనంతరం సౌందర్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు  అప్పగించారు శంషాబాద్  పోలీసులు. 

శంషాబాద్ లోని అర్కాన్ హాస్పిటల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్ పై నుండి దూకి అత్మహత్యకు పాల్పడిన సౌందర్య..   తాను ఊహించుకున్నట్లుగా జీవితం ఉండడం లేదని తరుచూ ఫ్రెండ్స్ తో చెప్పినట్లు తెలుస్తోంది.   ఇటీవలే ఉద్యోగం కోల్పోయి భర్త  ఇంటి వద్దే ఉంటుండని.. ఊహించుకున్న లైఫ్ లేదనే మనస్తాపంతో సౌందర్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.