కూకట్పల్లి, వెలుగు: భార్యతో చిన్న చిన్న విభేదాల కారణంగా మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్వేర్ఇంజినీర్సూసైడ్చేసుకున్నాడు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్పరిధిలో జరిగింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన రమేశ్(40) భార్య రాధికతో కలిసి కూకట్పల్లి దేవినగర్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేస్తున్నాడు.
మంగళవారం భార్య పుట్టినరోజు కావడంతో ఆమె అక్క, తమ్ముడు వీరు ఉంటున్న అపార్ట్మెంట్కు వచ్చారు. రాత్రి డిన్నర్ చేసేందుకు ట్యాంక్బండ్కు వెళ్దామనుకున్నారు. దీనికి రమేశ్ నిరాకరించాడు. దీంతో మిగతావారు బయటకు వెళ్లారు. తర్వాత గదిలో ఒంటరిగా ఉన్న రమేశ్అర్ధరాత్రి 12.30 గంటలకు భార్య రాధికకు ‘పొరపాటు జరిగింది.. సారీ.. గుడ్బై’ అని మెసేజ్ పెట్టాడు.
ఇది చూసిన భార్య, కుటుంబ సభ్యులు వచ్చి చూసే సరికే రమేశ్ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
