భార్య, పిల్లలు వెళ్లిపోయారని సాప్ట్వేర్ సూసైడ్

భార్య, పిల్లలు వెళ్లిపోయారని సాప్ట్వేర్ సూసైడ్

ట్యాంక్​బండ్, వెలుగు: కుటుంబ సమస్యలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన సాప్ట్​వేర్ ఇంజినీర్ సీతారాం రెడ్డి (36) బాచుపల్లిలో నివాసం ఉంటున్నాడు. కుటుంబ కలహాలతో ఇటీవల భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడం, ఇద్దరు పిల్లలను అత్తమామలు తీసుకెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఆదివారం ట్యాంక్​బండ్​లో దూకి సూసైడ్​ చేసుకున్నాడు. సోమవారం అతడి డెడ్​బాడీ లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.