కొన్ని పార్టీలు ఎన్నికల టైంలోనే బయటకు వస్తయ్: మంత్రి హరీష్రావు

కొన్ని పార్టీలు ఎన్నికల టైంలోనే బయటకు వస్తయ్: మంత్రి హరీష్రావు

కొన్ని పార్టీలు ఎన్నికల టైంలోనే బయటకు వస్తాయని విమర్శించారు మంత్రి హరీష్ రావు. ప్రజలకు సేవ చేసే నాయకుడిని ప్రజలు గెలిపించుకోవాలని కోరారు. ఉచిత కరెంట్ పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 8 గంటల కరెంట్ కూడా రావట్లేదు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు.. రాష్ట్రంలో మేం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అని చెప్పారు మంత్రి హరీష్ రావు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బావుల దగ్గర మోటార్లకు మీటర్లు పెడతామని అంటోందన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి రైతుబంధు, రుణమాఫీ, ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజల వైద్యానికి పెద్ద పీఠ వేస్తోందన్నారు మంత్రి హరీష్ రావు.