పార్టీకి సోనియాగాంధీ విరాళం ​50 వేలే

పార్టీకి సోనియాగాంధీ విరాళం ​50 వేలే

రూ.54 వేలు ఇచ్చిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ సోనియా గాంధీ, మాజీ  ప్రెసిడెంట్ రాహుల్​ గాంధీ పార్టీకి చాలా తక్కువ డొనేషన్లు ఇచ్చారు. సోనియా కేవలం రూ.50 వేలు, రాహుల్​ 54 వేలు మాత్రమే ఇచ్చారు. ‘జీ23’గా పేరున్న కాంగ్రెస్​లోని 23 మంది రెబెల్స్​ మాత్రం భారీగా డొనేషన్లు ఇచ్చారు. డొనేషన్లపై కాంగ్రెస్​ ఎలక్షన్ ​కమిషన్​కు అందించిన వివరాల్లో ఆసక్తికరమైన లెక్కలు కనిపించాయి. పార్టీకి మొత్తం 352 మంది నిధులు సమకూర్చారు. జీ23 గ్రూప్​లో అందరికంటే ఎక్కువగా అసమ్మతి లీడర్​గా పేరున్న కపిల్​ సిబల్​ రూ.3 కోట్లు ఇచ్చారు. గులామ్​నబీ ఆజాద్, ఆనంద్​ శర్మ, శశి థరూర్​, మిలింద్​ దేవ్​రా, రాజ్​బబ్బర్​ భారీగానే సాయం చేశారు. బబ్బర్​ రూ.1.08 లక్షలు, దేవ్​రా రూ.లక్ష, శర్మ రూ.54 వేల చొప్పున ఇచ్చారు.  మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్, మాజీ రక్షణమంత్రి ఏకే ఆంటోనీ, ఇటీవలే మరణించిన మోతీలాల్​ వోరా, అహ్మద్​ పటేల్, మాజీ కేంద్రమంత్రి ప్రణీత్​ కౌర్​, అధిర్​ రంజన్​ చౌదరిలో చాలా మంది రూ.54 వేల చొప్పున ఇచ్చారు. కొన్ని నెలల క్రితం బీజేపీలోకి వెళ్లిన జ్యోతిరాదిత్య సింధియా కూడా రూ.54 వేలు డొనేషన్​గా ఇచ్చారు. 2019–20లో కాంగ్రెస్​కు రూ.139 కోట్లు డొనేషన్లుగా అందాయి. కార్పొరేట్లు సైతం భారీగా డబ్బుసాయం చేశారు. ఎయిర్​టెల్​కు చెందిన ప్రూడెంట్​ ఎలక్టోరల్​ ట్రస్ట్​ రూ.31 కోట్లు, ఐటీసీ రూ.13 కోట్లు, ఐటీసీ ఇన్ఫోటెక్​ రూ.4 కోట్లు ఇచ్చాయి.

For More News..

లాటరీతోనే హెచ్ 1బీ వీసాలు

టెన్త్​ పాసైతే​ చాలు​.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్..

ఐపీఎల్‌ ఆక్షన్‌కు 1097 మంది ప్లేయర్లు