
రూ.54 వేలు ఇచ్చిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ, మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పార్టీకి చాలా తక్కువ డొనేషన్లు ఇచ్చారు. సోనియా కేవలం రూ.50 వేలు, రాహుల్ 54 వేలు మాత్రమే ఇచ్చారు. ‘జీ23’గా పేరున్న కాంగ్రెస్లోని 23 మంది రెబెల్స్ మాత్రం భారీగా డొనేషన్లు ఇచ్చారు. డొనేషన్లపై కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్కు అందించిన వివరాల్లో ఆసక్తికరమైన లెక్కలు కనిపించాయి. పార్టీకి మొత్తం 352 మంది నిధులు సమకూర్చారు. జీ23 గ్రూప్లో అందరికంటే ఎక్కువగా అసమ్మతి లీడర్గా పేరున్న కపిల్ సిబల్ రూ.3 కోట్లు ఇచ్చారు. గులామ్నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, శశి థరూర్, మిలింద్ దేవ్రా, రాజ్బబ్బర్ భారీగానే సాయం చేశారు. బబ్బర్ రూ.1.08 లక్షలు, దేవ్రా రూ.లక్ష, శర్మ రూ.54 వేల చొప్పున ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రక్షణమంత్రి ఏకే ఆంటోనీ, ఇటీవలే మరణించిన మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్, మాజీ కేంద్రమంత్రి ప్రణీత్ కౌర్, అధిర్ రంజన్ చౌదరిలో చాలా మంది రూ.54 వేల చొప్పున ఇచ్చారు. కొన్ని నెలల క్రితం బీజేపీలోకి వెళ్లిన జ్యోతిరాదిత్య సింధియా కూడా రూ.54 వేలు డొనేషన్గా ఇచ్చారు. 2019–20లో కాంగ్రెస్కు రూ.139 కోట్లు డొనేషన్లుగా అందాయి. కార్పొరేట్లు సైతం భారీగా డబ్బుసాయం చేశారు. ఎయిర్టెల్కు చెందిన ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.31 కోట్లు, ఐటీసీ రూ.13 కోట్లు, ఐటీసీ ఇన్ఫోటెక్ రూ.4 కోట్లు ఇచ్చాయి.
For More News..