పంజాబ్ ఎన్నికల బరిలో సోనూసూద్ చెల్లెలు

పంజాబ్ ఎన్నికల బరిలో సోనూసూద్ చెల్లెలు

చండీగఢ్: తాను ఏ పొలిటికల్ పార్టీలోనూ చేరట్లేదని బాలివుడ్ యాక్టర్ సోనూసూద్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది పంజాబ్​లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మోగా సెగ్మెంట్ నుంచి తన చెల్లెలు మాళవిక సూద్ మాత్రం పోటీ చేస్తారని ఆయన ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆమె ఏ పార్టీలో చేరతారనే విషయం కూడా ఆయన చెప్పలేదు. ‘‘తన కుటుంబం పంజాబ్ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటోంది. మాళవికకు మద్దతివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మాళవిక ఏ పార్టీలో చేరతారన్నదాని కంటే ఆ పార్టీ పాలసీనే ముఖ్యం. నా చెల్లెలు గెలిస్తే ఆరోగ్య రంగం, నిరుద్యోగ సమస్యలపై పోరాడుతుంది” అని సోనూ సూద్ అన్నారు.