డ్రై డే రోజు బ్లాక్ లో మద్యం అమ్ముతున్న వారి స్థావరాలపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేశారు. ఒకే రోజు 12 బెల్టు షాపులపై తనిఖీ చేశారు. 365 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.4 లక్షల 3 వేల 806 -విలువ మద్యాన్ని పట్టుకున్నారు.
వివరాలు పరిశీలిస్తే
మేడ్చల్ ఎస్ఓటీ టీం
దుండిగల్ పీఎస్ పరిధిలో- (16.9 లీటర్లు)
అల్వాల్ పీఎస్ పరిధిలో(127.6 లీటర్లు)
సూరారం పీఎస్ పరిధిలో (6.3 లీటర్లు)
మేడ్చల్ పీఎస్ పరిధిలో (23.9 లీటర్లు)
బాలానగర్ ఎస్ఓటీ టీం
బాచుపల్లి పీఎస్ పరిధిలో (17 లీటర్లు)
మాదాపూర్ ఎస్ఓటీ టీం
RC పురం పీఎస్ పరిధిలో – 01 (6.1 లీటర్లు)
చందానగర్ పీఎస్ పరిధిలో – 01 (84.3 లీటర్లు)
గచ్చిబౌలి పీఎస్ పరిధిలో – 02 (29.1 లీటర్లు)
మియాపూర్ పీఎస్ పరిధిలో (13.5 లీటర్లు)
రాజేంద్రనగర్ ఎస్ఓటీ టీం
అత్తాపూర్పీఎస్ పరిధిలో (4.3 లీటర్లు)
మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో (13.1 లీటర్లు)
నార్సింగి పీఎస్ పరిధిలో(14.6 లీటర్లు
అక్రమంగా మద్యం అమ్మిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించామని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతామని చెప్పారు.