న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.. మళ్లీ ఐపీఎల్లోకి అడుగుపెట్టనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. డీసీకే చెందిన ఐఎల్టీ20 టీమ్ దుబాయ్ క్యాపిటల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ (సౌతాఫ్రికా టీ20 లీగ్)కు కూడా దాదా తన సేవలను అందించనున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం ఫ్రాంచైజీ.. సౌరవ్కు వాటా ఏదైనా ఇస్తుందా? అనే అంశంపై క్లారిటీ లేదు. 2019లో డీసీ మెంటార్గా పని చేసిన దాదా బీసీసీఐ బాస్ అవడంతో ఈ పోస్ట్ నుంచి దిగిపోయాడు.