చెలరేగిన రిలీ రోసోవ్..సౌతాఫ్రికా భారీ స్కోర్

చెలరేగిన రిలీ రోసోవ్..సౌతాఫ్రికా భారీ స్కోర్

మూడో టీ20లో సౌతాఫ్రికా 227 రన్స్ చేసింది. రోసోవ్ సెంచరీతో చెలరేగాడు. 48 బాల్స్లోనే 100 రన్స్ చేసి తన జట్టుకు భారీ స్కోర్ను అందించాడు. ఇన్నింగ్స్ స్టార్టింగ్ నుంచే సఫారీ బ్యాట్మెన్స్ దూకుడుగా ఆడారు. డికాక్ హాఫ్ సెంచరీ చేసి 68 రన్స్ వద్ద రనౌట్గా వెనుదిరిగాడు. కెప్టెన్ బావుమా 3 రన్స్ చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. భారత బౌలర్లలో ఉమేష్, చాహర్ చెరో వికెట్ తీశారు. 

ఇప్పటికే ఈ సిరీస్ను ఇండియా కైవసం చేసుకోగా.. చివరి మ్యాచ్ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. అయితే ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని సౌతాఫ్రికా ప్రయత్నిస్తోంది. ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, అర్షదీప్ సింగ్ దూరమవ్వగా.. వారి స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఉమేష్ యాదవ్, సిరాజ్ ఆడుతున్నారు.