
వయనాడ్ బాధితుల కోసం సినిమా ఇండస్ట్రీ కదిలొస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ నుంచి మెగా కుటుంబం, ప్రభాస్, అల్లు అర్జున్, రష్మిక, నిర్మాత నాగవంశీ ఇలా పలువురు సెలబ్రిటీలు విరాళాలు ఇచ్చారు. తమిళ, మలయాళ సినీ పరిశ్రమ నుంచి కూడా అనేకమంది ప్రముఖులు విరాళాలు అందచేశారు.
తాజాగా తెలుగు, తమిళ, మలయాళం నుంచి సీనియర్ స్టార్ హీరోయిన్స్ వయనాడ్ బాధితుల కోసం ముందుకొచ్చారు. మీనా, కుష్బూ, సుహాసిని హీరోయిన్లు అంతా కలిసి డబ్బులు పోగేసి కోటి రూపాయల చెక్ ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు అందజేశారు.
సీఎం పినరన్ విజయన్ కు చెక్ ఈ ఫోటోలని షేర్ చేస్తూ సీనియర్ నటి మీనా తన సోషల్ మీడియాలో.."చెన్నై నుంచి మేము కొంతమంది మా ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ తరపున వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల డబ్బులు పోగేసాం. గౌరవనీయులైన కేరళ సీఎం పినరయి విజయన్ గారిని కలిసి కోటి రూపాయల చెక్కుని అందించాము. ఇందుకు సహకరించిన సుహాసిని, శ్రీప్రియ, కుష్బూ, మీనా, కళ్యాణి ప్రియదర్శన్, లిస్సి లక్ష్మి, శోభన..వీరి ఫ్యామిలీలకు అభినందనలు. వయనాడ్ ప్రజల కోసం మేము ప్రార్ధిస్తున్నామని" ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో సీనియర్ నటీనటులు చేసిన ఈసహాయానికి సినీ అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
ALSO READ | Prabhas: వయనాడ్ విషాదం.. ప్రభాస్ భారీ విరాళం
ఇప్పటికీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రామ్చరణ్ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ప్రభాస్ రూ.2 కోట్లు, అలాగే అల్లు అర్జున్ రూ.25 లక్షలు. ఇక హీరోయిన్లలో రష్మిక పది లక్షలు ప్రకటించగా, సంయుక్త మీనన్ వయనాడ్ బాధితుల సహాయార్థం కొంత సాయం చేసింది. వయనాడ్లో సహాయ కార్యక్రమాలు చేస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్కు ఆమె చెక్ను అందజేసింది.
తమిళ నటులు సూర్య, కార్తి, జ్యోతిక కలిసి 50 లక్షల రూపాయలను ఇవ్వగా, కమల్ హాసన్ రూ.25 లక్షలు, ఫహాద్ ఫాజిల్, నజ్రియా రూ.25 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, మమ్ముట్టి రూ.15 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.మరోవైపు నటుడు మోహన్లాల్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ. 3 కోట్ల విరాళం బాధితుల కోసం ఇస్తున్నట్టు తెలిపారు.