పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆత్మాహుతి యత్నం

పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆత్మాహుతి యత్నం

లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్ ఇవ్వలేదన్న మనస్తాపంతో సమాజ్వాదీ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. లక్నోలోని పార్టీ కార్యాలయం వద్ద నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. పార్టీ కార్యకర్తలు, పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అలీగఢ్కు చెందిన ఆదిత్య ఠాకూర్ ఏళ్లుగా సమాజ్వాదీ పార్టీ కోసం పనిచేస్తున్నారు. టికెట్ ఇస్తారన్న ఆశతో నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఎస్పీ చీఫ్ తనను కాదని బయటి వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యారు. విక్రమాదిత్య మార్గ్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చిన ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. గమనించిన పార్టీ కార్యకర్తలు, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఐదేళ్లుగా 74వ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన తనకు న్యాయం చేయాలని ఆదిత్య ఠాకూర్ డిమాండ్ చేశారు. 

https://twitter.com/ANINewsUP/status/1482640738831974409?cxt=HHwWkoDS-bD5spMpAAAA

ఇవి కూడా చదవండి..

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం

ఆన్‎లైన్ తరగతులపై ఓయూ కీలక ప్రకటన