
నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లా పరిధిలో ఉన్న పోలీసు అధికారులు , సిబ్బంది సర్వీస్ కు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లోనే నమోదు చేయాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. గురువారం ఉదయం జిల్లా ఎస్పీ డీపీఓ కార్యాలయానికి వెళ్లి ప్రత్యక్షంగా పోలీస్ అధికారులు సిబ్బంది సర్వీస్ సమాచారాన్ని ఆన్లైన్లో ఎలా నమోదు చేస్తున్నారో పరిశీలించారు.
లీవ్స్, ట్రాన్స్ ఫర్, పనిష్మెంట్స్, రివార్డ్స్ , ఇంక్రిమెంట్స్, శాలరీస్, అటాచ్మెంట్స్, ప్రమోషన్స్ తదితర వివరాల నమోదు హెచ్ఆర్ఎంఎస్ ఆన్లైన్లోనే జరగాలన్నారు. మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిధిలోని పోలీసు, అధికారులకు సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పీపీటీ ద్వారా ఉద్యోగి సర్వీస్ సమాచారాన్ని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ తదితరులు ఉన్నారు