హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 59వ రోజు ఆదివారం చిన్నారులు ఎక్కువగా సందర్శించే ఫుడ్ సెంటర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్లే జోన్లు, పార్కులు, ఫుడ్ కోర్టులు, బేకరీల్లో తనిఖీలు నిర్వహించారు. నాణ్యతపై అనుమానం ఉన్న ఫుడ్ నమూనాలను సేకరించి, ల్యాబ్కి పంపారు.
81 సెంటర్లపై దాడులు జరిపిన అధికారులు రూల్స్బ్రేక్చేసిన 14 మందికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. సరైన లేబులింగ్ఉండాలని, ఆహార పదార్థాలను సైంటిఫిక్పద్ధతిలో స్టోర్చేయాలని, పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టడంతో పాటు, దానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
