
‘శివం భజే’ చిత్రంతో గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన అశ్విన్ బాబు.. ప్రస్తుతం మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్లో నటిస్తున్నాడు. మెడికో థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు.
గురువారం అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. రియా సుమన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్, వీటీవీ గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, షకలక శంకర్, రాఘవ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే డెబ్భై ఐదు శాతం షూట్ పూర్తయింది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.