ఆగి ఉన్న డీసీఎంని ఢీ కొన్న వ్యాన్.. ఆరుగురు మృతి

ఆగి ఉన్న డీసీఎంని ఢీ కొన్న వ్యాన్.. ఆరుగురు మృతి

తమిళనాడులోని సేలంలో సెప్టెంబర్​6  తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం-ఈరోడ్ హైవేపై తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి ఆగి ఉన్న డీసీఎంని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 

ఆ  సమయంలో ఈంగూర్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యులు వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు. మృతులు సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతి, ఏడాది వయసున్న చిన్నారిగా గుర్తించారు.

ALSO READ : జలదృశ్యం ..పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు డ్యామ్ (వీడియో)

ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ విజువల్స్​ రికార్డు అయ్యాయి.