ప్రభుత్వ కాలేజీకి 100 డ్యూయల్ డెస్క్‌‌‌‌ లు వితరణ : శ్రీవ్యాల్ ఉయ్యూరి

ప్రభుత్వ కాలేజీకి 100 డ్యూయల్ డెస్క్‌‌‌‌ లు వితరణ : శ్రీవ్యాల్ ఉయ్యూరి
  • చదువే సంపదలకు మూలం : స్ఫూర్తి ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీవ్యాల్ ఉయ్యూరి 

గండీడ్, వెలుగు: సకల సంపదలకు మూలం చదువేనని స్ఫూర్తి ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీవ్యాల్ ఉయ్యూరి అన్నారు.  మంగళవారం మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి100 డ్యూయల్ డెస్క్ బెంచీలు అందజేశారు.  ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీవ్యాల్ ఉయ్యూరి మాట్లాడుతూ..  విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన్ని ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవీందర్, తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి, హెచ్ఎం పాండురంగారెడ్డి, గండీడ్ ఎంఈఓ జనార్ధన్, కమతం విష్ణువర్ధన్ రెడ్డి, ముంతాజ్ హుస్సేన్, విజయానంద రెడ్డి రవీందర్ రాజు, బెస్తరాజు, తదితరులు పాల్గొన్నారు.