బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే..అది మహేష్ బాబు: శ్రీలీల

బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే..అది మహేష్ బాబు: శ్రీలీల

టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా స్టార్ డమ్ తెచ్చుకున్న బ్యూటీ శ్రీలీల (Sreeleela). వరుస సినిమాలు చేస్తూ క్రెజీయెస్ట్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇపుడు తన నుంచి వస్తోన్న గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాతో ఆల్రెడీ సూపర్ ఫ్యాన్స్కు భలే నచ్చేసింది. 

నిన్న జరిగిన గుంటూరు కారం ఈవెంట్ లో పాల్గొన్న  శ్రీ లీల మాట్లాడుతూ.. ఇక్కడి (గుంటూరు) రెస్పాన్స్..ఇక్కడి జనాలని చూస్తే తనకు ఇప్పుడే అర్థమవుతుంది. సూపెర్ ఫ్యాన్స్ కు ఎలాంటి పిచ్చి ఉంటుందో అని. గుంటూరు వస్తే హీరోగారు తనను ఎందుకు గుర్తుపెట్టుకోమన్నారో అంటూ మహేష్ బాబు డైలాగ్ ని స్టేజీ పైన గుర్తు చేసింది. గుర్తుపెట్టుకున్నా అందుకే ఇక్కడికి వచ్చాను.. ఇప్పుడు ఇదంతా మీ అందరికీ గుర్తుండి పోతుంది, ఇంత ప్రేమ చూపిస్తున్న మీ అందరికీ థాంక్యూ సో మచ్ అని చెప్పుకొచ్చింది.

ముందుగా, డైరెక్టర్ త్రివిక్రమ్ కి థాంక్స్ చెబుతూ..నాకిలాంటి అమ్ము అనే క్యారెక్టర్ చేసే అవకాశం ఇవ్వడం తనకు  చాలా గొప్ప విషయం అని..అలాగే సెట్లో తన అల్లరి భరించినందుకు థాంక్స్ చెప్పుకొచ్చింది. త్రివిక్రమ్ ఎన్నో పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని ఒక పాటలోనో, మాటలోనో, సినిమా ద్వారానో తీసుకొస్తారని..అలాంటి వాటిలో తమను కూడా భాగం చేస్తున్నందుకు మాకు ఎంతో గౌరవం.

హీరో మహేష్ బాబు గురుంచి మాట్లాడుతూ..బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో మహేష్ బాబు అలాగే ఉంటారని చెప్పింది.. అతను బయటే కాదు ఆయన మనసు కూడా బంగారమేనని.. నిజానికి తాను కూడా అక్కడ గ్రౌండ్ లో ఉండాల్సిన దాన్ని. కానీ దేవుడు నా నోటితో కొన్ని చెప్పించాలని..అందరి తరుపున స్టేజ్ మీదకి పంపించాడేమో అనిపిస్తుందని శ్రీలీల తెలిపింది.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బ్యూటీ శ్రీలీల తో పాటు ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పక్కా మాస్ మసాలా కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ జనవరి 12న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.