
గండిపేట్, వెలుగు: నగరంలోని మణికొండ, బండ్లగూడ జాగీరూ మునిసిపాలిటీల పరిధిలో శ్రీజగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గురువారం మణికొండలో మునిసిపల్ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ రథయాత్రను ప్రారంభించారు. పలు వీధుల గూండా యాత్ర కొనసాగగా భక్తులు హారతులు పట్టారు.