తిప్పేసిన జడేజా.. శ్రీలంక 174 ఆలౌట్

తిప్పేసిన జడేజా.. శ్రీలంక 174 ఆలౌట్

శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ అదరగొడుతోంది. అటు బ్యాటింగ్ లో 175(నాటౌట్) తో దుమ్మురేపిన ఆల్ రౌండర్ జడేజా ఇటు బౌలింగ్ లోనూ దుమ్మురేపాడు ఐదు వికెట్లతో చెలరేగి ఆడాడు. దీంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  మూడో రోజు 108/4 తో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 66 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ కు  తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగుల ఆధిక్యం లభించింది. మరో వైపు రెండో  ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆడుతోన్న శ్రీలంక లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. క్రీజులో కరుణరత్నె, నిస్సాంక ఉన్నారు. ఇంకా 390 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత్. గత 49 ఏళ్లలో ఒకే ఇన్నింగ్స్ లో  ఒక ప్లేయర్ 150 కి పైగా పరుగులు చేయడం, ఐదు వికెట్లు తీయడం ఇదే మొదటి సారి కావడం రికార్డ్.