శ్రీలంక టీమ్కు ఘన స్వాగతం

శ్రీలంక టీమ్కు ఘన స్వాగతం

ఆసియాకప్2022 గెలిచి స్వదేశానికి తిరిగొచ్చిన శ్రీలంక క్రికెట్ టీమ్ విక్టరీ పరేడ్ నిర్వహించింది. ఎయిర్ పోర్టు నుంచి క్రికెట్ బోర్డు ఆఫీసు వరకు పరేడ్ జరిగింది. డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించిన క్రికెటర్లు..దారి పొడవును అభిమానులు అభివాదం చేశారు. అటు అద్భుతమైన ఆటతీరుతో ఆసియాకప్లో విజేతగా నిలిచిన లంక టీమ్కు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. 

ఘన స్వాగతం..
అంతకుముందు దుబాయ్ నుంచి ఆసియాకప్తో స్వదేశంలో అడుగుపెట్టిన లంక క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది.  శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు,  లంక స్పోర్ట్స్ మినిస్టర్ బండారు నాయకే ఎయిర్ పోర్టులో క్రికెటర్లకు వెల్ కమ్ చెప్పారు. 

పాక్పై అద్బుత విజయం
ఆసియా కప్ను శ్రీలంక కైవసం చేసుకుంది. టైటిల్ పోరులో పాకిస్తాన్ను 23రన్స్ తో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక..20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఆ తర్వాత 171 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన పాక్..సరిగ్గా 20 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. లంకు ఇది  ఆరో ఆసియా కప్ కావడం విశేషం.