గోషామహల్లో శ్రీరామకథ కార్యక్రమం..హాజరైన వివేక్ వెంకటస్వామి

గోషామహల్లో శ్రీరామకథ కార్యక్రమం..హాజరైన వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో శ్రీ రామ కథ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గోవత్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోవుల సంరక్షణ కోసం 8 రోజులపాటు ఈ ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. రాధాకృష్ణ మహారాజ్ రామ కథను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫండ్స్ మొత్తాన్ని 22 గోశాలల నిర్వాహణకు వినియోగిస్తారు. చివరి రోజు రామకథ, రాముడికి రాజ్యాభిషేక కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 

జీవన్ కే సాథ్, జీవన్ కి బాత్ బి అనే కార్యక్రమం ద్వారా డొనేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డొనేషన్ ఇచ్చేవారు ప్రతి రోజు 15 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు సూచించారు. దీని ద్వారా వచ్చిన డబ్బును కూడా గోమాతల సంరక్షణకు ఉపయోగించనున్నారు.