
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ మండలం శ్రీపురంలోని శ్రీరంగనాయకస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నారు. శుక్రవారం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ కమిటీ సభ్యులు రిలీజ్ చేశారు.
ప్రతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త రంగాచార్యులు తెలిపారు. భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆలయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, వినోదాచార్యులు, చంద్రనారాయణ, వరదయ్య, రవీందర్ రెడ్డి, మాధవ్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి, మల్లికార్జున్, రవి పాల్గొన్నారు.