ఉద్యోగులది ప్రభుత్వానిది రక్త సంబంధం

ఉద్యోగులది ప్రభుత్వానిది రక్త సంబంధం

ఉద్యోగులది ప్రభుత్వానిది రక్త సంబంధమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రశ్నించే గొంతు కావాలా... పరిష్కారించే గొంతు కావాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆలోచించుకోవాలన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలన్న మోడీ మాట తప్పారన్నారు. బీజేపీకి ఉద్యోగులపై ప్రేమ ఉంటే సీపీఎస్ ను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు.  కేంద్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటే సీపీఎస్ ను ఎపుడో రద్దు చేసేదన్నారు. వాణీదేవి పాలమూరు జిల్లా వాసి..అని భారీ మెజారిటీతో గెలిపిస్తే పాలమూరు అభివృద్దికి తోడ్పడుతారన్నారు.