
సంప్రదాయ వృత్తుల ప్రోత్సాహంతో పాటు ప్రకృతి పరిరక్షణ కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సహకారంతో తాటాకు బుట్టలను తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు శుక్రవారం పలు రకాల బుట్టలను ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ నిర్ణయంతో తాటి చెట్లను పెంచే వారికి ఆదాయం, తాటాకు బుట్టలను తయారు చేసే వారికి చేయూత అందుతుందని టీటీడీ భావిస్తోంది. ఈ సమయంలో తాటాకు బుట్టల వినియోగం సాధ్యాలతో పాటు లడ్డు ప్రసాదాలను తీసుకెళ్లే భక్తులకు తాటాకు బుట్టలు ఎంతమేర ఉపయోగకరంగా ఉంటాయన్న దానిపై టీటీడీ అధ్యయనం చేయనుంది. కాగా ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. వాటి స్థానంలో బయో'డీ'గ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.