మరో రెండు మ్యాచ్‌‌లకు పాండ్యా దూరం!

మరో రెండు మ్యాచ్‌‌లకు పాండ్యా దూరం!

న్యూఢిల్లీ: వరల్డ్‌‌ కప్‌‌లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు బ్యాడ్‌‌ న్యూస్‌‌. చీలమండ గాయంతో ఇబ్బందిపడుతున్న స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా మరో రెండు మ్యాచ్‌‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం అతను నేషనల్‌‌ క్రికెట్‌‌ అకాడమీలో ఇంజ్యురీ మేనేజ్‌‌మెంట్‌‌ వద్ద గాయానికి చికిత్స తీసుకుంటున్నాడు.

ఈ నెల 19న బంగ్లాదేశ్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో బౌలింగ్‌‌ చేస్తూ జారిపడటంతో పాండ్యా చీలమండకు గాయమైంది. దీంతో 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో అతను ఆడలేదు. ‘హార్దిక్‌‌కు ఇంకా చికిత్స కొనసాగుతున్నది. చీలమండ వాపు బాగా తగ్గింది. అయితే బౌలింగ్‌‌ చేసేందుకు మరికాస్త టైమ్‌‌ పడుతుంది. చీలమండలో ఎలాంటి ఫ్రాక్చర్‌‌ లేదు. బోర్డు వైద్య బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది.

నాకౌట్‌‌ వరకు పూర్తి ఫిట్‌‌నెస్‌‌తో ఉండాలని టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కోరుకుంటోంది’ అని ఎన్‌‌సీఏ ఫిజియో వెల్లడించారు. పాండ్యా లేకపోవడంతో టీమ్‌‌లోకి సూర్యతో పాటు మహ్మద్‌‌ షమీకి ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో చాన్స్‌‌ దొరికిన సంగతి తెలిసిందే.