బల్దియా పోరుకు టీఆర్‌‌ఎస్ క్యాంపెయినర్లు వీళ్లే..

బల్దియా పోరుకు టీఆర్‌‌ఎస్ క్యాంపెయినర్లు వీళ్లే..

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలకు నగారా మోగింది. ప్రచారంతో హోరెత్తించేందుకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. స్టార్ క్యాంపెయినర్లతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. తాజాగా అధికార టీఆర్‌‌ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌‌ను ప్రకటించింది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌తోపాటు మంత్రులు హరీశ్ రావ్, మహమూద్ అలీ, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్‌‌, సబితా ఇంద్రా రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్‌‌ను స్టార్ క్యాంయినర్లుగా టీఆర్ఎస్ ప్రకటించింది.