Siddu, VenkyAturi: హీరో, దర్శకుడు అదే బ్యానర్ లో.. ఇప్పుడు మరోటి!

Siddu, VenkyAturi:  హీరో, దర్శకుడు అదే బ్యానర్ లో.. ఇప్పుడు మరోటి!

టిల్లు సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu jonnalagadda). అందులో.. రెండో సినిమాతోనే వంద కోట్ల హీరోగా మారిపోయాడు. దీంతో.. మొన్నటివరకు సినిమా అవకాశాల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరిగిన సిద్దు చుట్టూ ఇప్పుడు నిర్మాతలు తిరుగుతున్నారు. ఆయన చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక సిద్దు కూడా వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వరుస సినిమాలను ఒకే చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను చేతిలో పెట్టుకున్న సిద్దు.. తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్ కాగా.. రెండవది దర్శకురాలు నీరజ కోన తో తెలిసు కదా అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ సినిమాల తరువాత మరో క్రేజీ దర్శకుడితో మూవీ చేసేందుకు ఒకే చెప్పేశాడట సిద్దు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. తన తొలి సినిమా తొలిప్రేమతోనే సూపర్ హిట్ అందుకున్న వెంకి అట్లూరి. అవును.. దర్శకుడు వెంకి ఈ మధ్యే సిద్దుకి ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కథని వినిపించాడట. ఆ కథ కూడా సిద్దుకి బాగా నచ్చిందట. అందుకే వెంటనే ఈ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పేశాడట. 

Also Read:బచ్చల మల్లిగా అల్లరి నరేష్.. ఆసక్తిరేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్

త్వరలోపే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రానుందని సామాచారం. ఇక సిద్దుతో డిజే టిల్లు, టిల్లు స్క్వైర్, వెంకి అట్లురితో రంగ్ దే, సార్, ఇప్పుడు లక్కీ భాస్కర్ వంటి సినిమాలు చేసిన సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. సిద్దు జాక్, తెలుసు కదా సినిమాలను.. వెంకి అట్లూరి లక్కీ భాస్కర్ సినిమాను కంప్లీట్ చేశాక కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. మరి సూపర్ హిట్ కంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాదిస్తుంది అనేది చూడాలి.