బోగస్ ఓట్లను త్వరలోనే గుర్తిస్తాం

బోగస్ ఓట్లను త్వరలోనే గుర్తిస్తాం

హైదరాబాద్: బుద్ధభవన్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో సిమిలర్ ఫోటోస్ ఎంట్రీ, ఎపిక్ కార్డులపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల సిమిలర్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 90 వేల సిమిలర్ ఓట్లు ఉన్నట్లు ఈసీ నోట్ విడుదల చేసింది. సిమిలర్ ఓట్లలో కొన్ని బోగస్ ఓట్లు కూడా ఉండొచ్చన్నారు. బోగస్ ఓట్లను త్వరలోనే గుర్తిస్తామని వికాస్ రాజ్ అన్నారు. మే 20వ తేదీ వరకు బోగస్ ఓట్ల గుర్తింపు పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం:

వివాదాస్పద ట్వీట్.. జిగ్నేశ్ మేవానీ అరెస్ట్

విజయ్ దేవరకొండ, సమంత జోడీగా కొత్త సినిమా షురూ

రష్యా గుప్పిట్లోకి ఉక్రెయిన్ ప్రధాన నగరం