నాలుగు ఎంపీ సీట్లకు కాంగ్రెస్ ఇన్ చార్జ్‌ల నియామకం

నాలుగు ఎంపీ సీట్లకు కాంగ్రెస్ ఇన్ చార్జ్‌ల నియామకం

హైదరాబాద్, వెలుగు: నాలుగు ఎంపీ సీట్లకు ఇన్ చార్జ్ లను నియమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్  వ్యవహారాల ఇన్ చార్జ్  దీపాదాస్  మున్షీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్ నగర్  ఇన్ చార్జ్ గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మెదక్  ఇన్ చార్జ్ గా పీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జహీరాబాద్  ఇన్ చార్జ్ గా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్  మోహన్ రావు, చేవెళ్ల ఇన్ చార్జ్ గా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్  రెడ్డిని నియమించారు.