హుజురాబాద్‌లో ఇప్పటి వరకు 88 ఫిర్యాదులు

హుజురాబాద్‌లో ఇప్పటి వరకు 88 ఫిర్యాదులు

హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నిక తీరును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ పరిశీలించారు. కమలాపూర్‎లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆయన.. నియోజకవర్గంలోని 306 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందాయని వాటిపై  వివరాలు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. డబ్బుల పంపిణీపై అందిన ఫిర్యాదులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని గోయల్ చెప్పారు. ఓటర్లు చాలా ఉత్సాహంగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. ఫిర్యాదులపై విచారణలో నిజాలు తేలితే ఎన్నికల అనంతరం కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.