ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు

ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: హాకీ క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తాచాటి పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్​ శంకర్​అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి హాకీ సబ్ జూనియర్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. నిజామాబాద్, నల్గొండ జట్లు సెకండ్, థర్డ్​ప్లేస్​ సాధించాయి. 

విజేత జట్లకు ఎంపీ, ఎమ్మెల్యేలు కప్పులతో పాటు హాకీ బ్యాట్లు అందజేశారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు     క్రీడాకారులు, కోచ్ లు పాల్గొన్నారు.