హైదరాబాద్ జీడిమెట్లలో స్టీల్ బ్రిడ్జి పనులు.. ఈ రోడ్లు క్లోజ్.. మెయిన్ డైవర్షన్లు ఇవే..

హైదరాబాద్ జీడిమెట్లలో స్టీల్ బ్రిడ్జి పనులు.. ఈ రోడ్లు క్లోజ్.. మెయిన్ డైవర్షన్లు ఇవే..

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డులో కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు విధించారు. నవంబర్ 3వ తేదీ నుంచి పనులు పూర్తయ్యే వరకు సాయికాంత, మయూరి బార్, సుభాష్ నగర్ మార్గాల్లో భారీ రద్దీ ఉంటుందని,  ప్రత్యామ్నాయ రూట్లు ఎంచుకోవాలని సూచించారు.

మెయిన్​ డైవర్షన్లు ఇవే..
గాజులరామారం, షాపూర్ నగర్, రంగభుజంగ నుంచి సుచిత్రకు వెళ్లే వెహికల్స్​సాయికాంట దగ్గర కుడివైపు తిరిగి  అయోధ్యానగర్, కుత్బుల్లాపూర్, సుచిత్ర చేరుకోవాలి. గాజులరామారం, షాపూర్​నగర్, రంగభుజంగ నుంచి కొంపల్లి వెళ్లే వాహనాలు సాయికాంట దగ్గర ఎడమ వైపు తీసుకుని సుభాష్​నగర్, దూలపల్లి ఇండస్ట్రియల్​ఏరియా మీదుగా కొంపల్లి  చేరుకోవాలి. మయూరి బార్ నుంచి జీడిమెట్ల రోడ్డుకు వెళ్లాలంటే మయూరి బార్‌ వద్ద రైట్ తీసుకుని సుభాష్ నగర్ లాస్ట్ బస్టాప్ వద్ద  లెఫ్ట్ తీసుకొని, పైప్‌లైన్ రోడ్ లేదా రైట్ తీసుకొని ఐలా రోడ్​వెళ్తే.. జీడిమెట్ల రోడ్డుకు చేరుకోవచ్చు.  

ఈ రోడ్లు క్లోజ్​.. 
పిస్తా హౌస్ సమీపంలోని హోమ్ లేన్ షాప్ నుంచి పైప్‌లైన్ రోడ్డులో హెవీ వెహికల్స్​రాకపోకలు బంద్​చేశారు. మయూరి బార్ టీ- జంక్షన్ నుంచి 200 మీటర్ల వరకు పూర్తిగా మూసివేస్తారు. గోదావరి హోమ్స్ నుంచి కూడా భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11:50 వరకు  ఏ భారీ వాహనానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. హెల్ప్‌ కోసం సైబరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్  9049991100 నంబర్లో సంప్రదించవచ్చన్నారు.