తమకు సర్వ్ చేసిన ఫుడ్ లో క్వాలిటీ లేకపోవడంతో హోటల్ యజమాన్యంతో గొడవకు దిగారు కస్టమర్లు. నాసిరకం ఆహారాన్ని అందించడమే కాక, ఎక్కువ రేట్లను వసూలు చేస్తున్న ఆ హోటల్ యాజమానిపై దాడి చేశారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిందీ సంఘటన. డబ్బు చెల్లించి తింటున్న ఆ ఆహారంలో నాణ్యత లేదని కస్టమర్లు అంతా కలసి హోటల్ మేనేజ్ మెంట్ ని నిలదీశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినొకరు చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలన్ని అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
#WATCH Madhya Pradesh: Scuffle broke out between customers & staff at a restaurant in Bhopal, allegedly after customers complained of poor quality food at the restaurant. (28.10.2019) pic.twitter.com/9w5HptMk1o
— ANI (@ANI) October 30, 2019