నాసిరకం ఫుడ్.. హోటల్ ఓనర్ ని చితకబాదిన కస్టమర్లు

నాసిరకం ఫుడ్.. హోటల్ ఓనర్ ని చితకబాదిన కస్టమర్లు

తమకు సర్వ్ చేసిన ఫుడ్ లో క్వాలిటీ లేకపోవడంతో హోటల్ యజమాన్యంతో గొడవకు దిగారు కస్టమర్లు. నాసిరకం ఆహారాన్ని అందించడమే కాక,  ఎక్కువ రేట్లను వసూలు చేస్తున్న ఆ హోటల్ యాజమానిపై దాడి చేశారు.  మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిందీ సంఘటన. డబ్బు చెల్లించి తింటున్న ఆ ఆహారంలో నాణ్యత లేదని కస్టమర్లు అంతా కలసి హోటల్ మేనేజ్ మెంట్ ని నిలదీశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినొకరు చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలన్ని అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.