అనుమతులు లేని భవనాలపై కఠిన చర్యలు : కృష్ణారావు

అనుమతులు లేని భవనాలపై కఠిన చర్యలు : కృష్ణారావు

హైదరాబాద్ కూకట్పల్లిలో బిల్డింగ్ కూలిన ఘటనపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. అనుమతులు లేని భవనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మూడవ అంతస్తు సరిగ్గా క్యూరింగ్ కాకముందే నాలుగో వంతు నిర్మించడం వల్లే ఘటన జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. 

జీహెచ్ఎంసీ అధికారులు గత వారం రోజుల క్రితం నిర్మాణదారుడికి నోటీసులు అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంటే నిర్మాణదారులు కోర్టు ఆర్డర్లు తెచ్చుకొని నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు మరల పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.