ఏజెన్సీ ప్రాంతాల్లో కఠిన నిఘా.. మావోయిస్టులు లొంగితే పూర్తి సహకారం అందిస్తాం : ఎస్పీ శభరీష్

 ఏజెన్సీ ప్రాంతాల్లో కఠిన నిఘా.. మావోయిస్టులు లొంగితే పూర్తి సహకారం అందిస్తాం : ఎస్పీ శభరీష్

ఇటివల పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎన్ కౌంటర్ తో హై అలర్ట్ ప్రకటించారు ములుగు జిల్లా పోలీసులు. మావోయిస్టులు హెచ్చరికలు జరీ చేయడంతో సరిహద్దు ప్రాంతాల్లో కూబింగ్ నిర్వహించారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కఠిన నిఘా ఏర్పాటు చేశారు. మవోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని ములుగు జిల్లా ఎస్పీ శభరీష్ తెలిపారు. 2024, ఏప్రిల్ 27 శనివారం నాడు ఆయన v6తో మాట్లాడుతూ 

మావోయిస్టు సెగ్మెంట్లుగా ములుగు, భధ్రాచలం ఉన్నాయని తెలిపారు. గోదావరి తీరం వెంట డ్రోన్ కెమెరాతో సెర్చింగ్ చేస్తున్నామని వెల్లడించారు. మావోయిస్టులు లొంగితే పోలీసుల నుంచి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు జిల్లా ఎస్పీ శభరీష్.