న్యూఢిల్లీ: సమస్యల పరిష్కారానికో.. డిమాం డ్ల సాధనకో ఉద్యోగులు సమ్మె చేయాలనుకుంటే కనీసం 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని ప్రభుత్వం కొత్త రూల్ తీసుకురానుంది. ఈమేరకు నోటీసును తప్పనిసరి చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. ఇప్పుడున్న 44 కార్మిక చట్టాలను సవరించి, కొత్తగా నాలుగు కోడ్స్గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఈ సవరణలలో 14 రోజుల నోటీసు విషయాన్నీ పొందుపరచనున్నట్లు చెప్పారు. దీనిపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ మంత్రి గంగ్వార్ సభ్యులను కోరారు. మరోవైపు, 2016లో నిర్వహించిన సర్వే ప్రకారం.. దేశంలో మొత్తం 10 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని మంత్రి చెప్పారు.